Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేటీఆర్ చెప్పింది అక్షర సత్యం: ఏపీలో సౌకర్యాలపై సీపీఐ నారాయణ
posted on: Apr 30, 2022 3:38PM
సీపీఐ పార్టీ సీనియర్ నేత నారాయణ ఏమి చేసినా.. ఏది మాట్లాడినా ఓ సంచలనం అవుతుంది. ఏపీ అసెంబ్లీలో 151 సీట్లు గెలిచిన సీఎం జగన్ ను పొగుడుతూనే ఇంకా బానిస బతుకేనా? అంటూ చురకలంటించినా, ప్రధాని మోడీని వరసపెట్టి ఏకేసినా.. ఆర్కే రోజా నియోజవర్గం నగరిలో ఉపాధి కూలీగా మారి, పని చేసినా... ‘అదొక బ్రోతల్ హౌస్’ అని బిగ్ బాస్ షోని పోల్చినా.. సినీ నటి కంగనా రనౌత్ ని ‘కాస్ట్లీ బిచ్చగత్తె’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినా.. వైసీపీ- బీజేసీ సహజీవనం చేస్తున్నాయన్నా నారాయణ రూటే సెపరేట్ గా ఉంటుందనేది నిర్వివాదాంశం. అంతుకే నారాయణ ఏం చేసినా.. ఏది మాట్లాడినా సంచలనంగానే ఉంటాయి.
తాజాగా.. సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘ఏపీలో కరెంట్ లేదు.. నీళ్లు ఉండవు.. రోడ్లు అధ్వాన్నం.. అసలు మౌలిక సదుపాయాలే ఉండవు‘ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభ వేదిక నుంచి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యల నేపథ్యంలో నారాయణ ఆంధ్రా- తమిళనాడు సరిహద్దును పరిశీలించి.. ఇరు రాష్ట్రాల్లోని రోడ్ల పరిస్థితిని పోల్చి మరీ నారాయణ వ్యాఖ్యానించడం విశేషం. ఏపీలో రోడ్లు గుంతలతో నిండిపోయి ఉన్నాయని, పొరుగు రాష్ట్రాల్లో చక్కగా ఉన్నాయని చెప్పారు. ఏపీ రోడ్లను తమిళనాడు రోడ్లతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఒక పక్కన ఫైరైపోతున్న సమయంలో తాను ఆయన మాటలతో తాను ఏకీభవిస్తున్నానని నారాయణ మాట్లాడడం గమనార్హం.
మొన్నా మధ్యన బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుతూ.. ‘అదొక బ్రోతల్ హౌస్’ అని నారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. బిగ్ బాస్ హౌస్ అనేది ఒక సోషల్ క్రైమ్ అని, దాని వల్ల సమాజానికి ఉపయోగం ఏమీ లేదని అన్నారు. భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని, అది ఒక భిక్ష అని సినీనటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై నారాయణ స్పందిస్తూ.. ‘కంగన ఒక విలాసవంతమైన బిచ్చగత్తె’ అంని నిప్పులు చెరగడం అందర్నీ ఆశ్చార్యానికి గురిచేసింది. మోడీ ప్రధాని అయ్యాయే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందన్న ఆమె మాటల్ని తిప్పికొడుతూ.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే అర్హతే కంగనకు లేదని, ఆ వ్యాఖ్యలు ఆమె బానిస మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని విరుచుకుపడ్డారు. దేశ ప్రజలకు కంగన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం.
బీజేపీ తనకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నారాయణ స్పందిస్తూ.. ఏపీలో వైసీపీ- బీజేపీ సహజీవనం చేస్తున్నాయని.. మధ్యలో దూరిన పవన్ కు బీజేపీ రోడ్ మ్యాప్ ఇందుకిస్తుంది? ఇవ్వదని తేల్చి చెప్పేయడం కమలం- ఫ్యాన్ గుర్తుల రహస్య బంధాన్ని బయటపెట్టేయడం ఆసక్తిగా మారింది. గత ఏడాది మే నెలలో నారాయణ ఉపాధి హామీ కూలీగా మారడం విశేషం. చిత్తూరు జిల్లాలోని ఆర్కే రోజా సొంత ఇలాకా నగరి నియోజకవర్గంలోని అయనంబాక చెవురులో రెండు రోజులు ఉపాధి హామీ కూలిపనులు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లెఫ్ట్ పార్టీలు ఉద్యమించి, పార్లమెంట్ లో సాధించుకున్న పథకం అని ఆయన చెప్పడా గమనార్హం.
ఇటీవలే కమ్యూనిస్తు నేత నారాయణ విశాఖపట్నంలోని శ్రీ శారదాపీఠాన్ని సందర్శించడం, పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలుసుకోవడం సంచలనంగా మారింది. సమ సమాజ స్థాపనకు జీవితాన్నే ధారపోసిన నారాయణ ఇలా స్వామీజీ దర్శనం చేసుకోవడం, నారాయణకు స్వామీజీ కాషాయం కండువా కప్పి ఆహ్వానించడం, స్వామీజీకి శిరసు వంచి, చేతులు జోడించి నారాయణ నమస్కారం చేయడం ఆసక్తిగా మారింది.
ఇటీవలే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి విధానాన్ని తప్పుపడుతూ సీపీఐ నారాయణ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సరిగా జరగలేదని, ఎమ్మెల్యేలను సంప్రదించకుండా జిల్లాల్ని విభజించడం జగన్ సొంత వ్యవహారం కాదని కామెంట్ చేయడానికి నారాయణ వెనుకాడలేదు. అసలు జిల్లాల విభజనకు గవర్నర్ ఏ విధంగా అంగీకరించారని ప్రశ్నించారు. చేతిలో అధికారం ఉంది కదా అని జగన్ ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేస్తారా? అని నారాయణ నిలదీయడం గమనించదగ్గ విషయం. గవర్నర్ గా తాను ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడిని అని నారాయన అనడం సంచలనం అయింది. ఏపీలో విద్యుత్ ధరలను పెంచినప్పుడు కూడా ప్రభుత్వ నిర్ణాయినిక వ్యతిరేకంగా నారాయణ స్పందించారు. ప్రధాని మోడీ, జగన్ ప్రజలపై విద్యుత్ ధరలు పెంచి భారం మోపుతున్నారని ఆక్షేపించారు.
జాతీయ రహదారి పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే.. ఊరుకోబోమని, భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని అధికారులు బెదిరించడం దుర్మార్గమని అన్నారు. అలా చేస్తే అధికారుల చేతివేళ్లు కట్ చేస్తామని నారాయణ హెచ్చరించడం సంచలనం అయింది.






